ప్రధానితో కీలక సమావేశం: ఈ భేటీలో ఆ ఇష్యూకు ముగింపు..

ఢిల్లీకి ముఖ్యమంత్రి జగన్: ప్రధానితో కీలక సమావేశం: ఈ భేటీలో ఆ ఇష్యూకు ముగింపు..!


ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి జగన్..ప్రధాని మోదీతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ పూర్తయిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి ప్రధానితో భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో ఏపీలో ప్రభుత్వ అమలు చేస్తున్న చర్యలు..రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్టులో తగ్గిన వ్యయం గురించి ప్రధానికి వివరించనున్నారు. పోలవరం నిర్మాణ ఖర్చును కేంద్రం రీయంబర్స్ చేస్తున్న సమయంలో ఈ మొత్తం ఒక విధంగా కేంద్రానికి మేలు జరిగే అంశం.